మాస్టర్‌చెఫ్ ఇండియా.. రన్నరప్‌గా సాయి శ్రీ

మాస్టర్‌చెఫ్ ఇండియా.. రన్నరప్‌గా సాయి శ్రీ

TG: మాస్టర్‌చెఫ్ ఇండియా సీజన్–10లో తెలంగాణ యువతి రన్నరప్‌గా నిలిచింది. మంచిర్యాల జిల్లాకు చెందిన రాచకొండ సాయి శ్రీ ఈ ఘనతను సాధించింది. ఈ సీజన్‌లో మాస్టర్‌చెఫ్ ఇండియా తొలిసారిగా జోడీ ఫార్మాట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో సాయి శ్రీ, ఆమె తల్లి జోడీగా పాల్గొన్నారు. ఈ క్రమంలో వారి జోడీ రన్నరప్‌గా నిలిచింది.