నేటికీ జీతాలు పడలేదని ఉద్యోగస్తుల ఆవేదన
VZM: జిల్లాలో జలవనరులు, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్, R&B సహా ఇతర ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగస్టులకు నేటికీ (10వ తేదీ)కూడా ప్రభుత్వం జీతాలు వేయలేదని ఉద్యోగస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు STO(సబ్ ట్రెజరీ ఆఫీసర్)ఎల్వీ యుగంధర్ని APCPSEA సభ్యులు కలిసి సమస్యను విన్నవించుకున్నారు. కాగా ఈ విషయంపై STO అమరావతి అధికారులకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు.