విద్యార్థి మృతి.. కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్యే
KRNL: హొళగుంద మండలం సమ్మతగేరి గ్రామానికి చెందిన అడ్వకేట్ లక్ష్మీకాంత కుమారుడు బళ్లారిలో గురుకుల వసతి గృహంలో జరిగిన ఘర్షణలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి గ్రామానికి చేరుకుని మృతదేహానికి ఇవాళ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.