దారుణం.. గిరిజనుడి పీక కోసి హత్య

దారుణం.. గిరిజనుడి పీక కోసి హత్య

ASR: ముంచంగిపుట్టులో నిన్న అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ గిరిజనుడిని పీక కోసి హత్య చేశారు. మృతుడు పెదబయలు మండలం అరడకోట గ్రామానికి చెందిన కుర్తాడి నాగేశ్వరరావుగా గుర్తించారు. ఆయన కొండపడలో జరుగుతున్న హోలీ జాతర పండుగను వీక్షించేందుకు వచ్చి ఉండగా, అర్ధరాత్రి సమయంలో మండల కేంద్రంలోని ఏటీఎం సమీపంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.