బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి: ASP

బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి: ASP

సత్యసాయి: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ (ASP) అంకిత సురాన బాధితుల నుంచి 49 అర్జీలు స్వీకరించారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, సైబర్ మోసాలపై వచ్చిన ఫిర్యాదులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. చట్ట పరిధిలో విచారణ జరిపి బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.