'సమస్యలు పరిష్కరించడమే గ్రీవెన్స్ డే లక్ష్యం'
JGL: ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా, జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో 18 మంది అర్జీదారుల సమస్యలను ఎస్పీ అశోక్ కుమార్ నేరుగా అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.