10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

TG: రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరగనుంది. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దని సూచించింది. పెరిగే ఉష్ణోగ్రతల వల్ల వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.