ఓవర్ లోడ్ వాహనాలపై ప్రత్యేక నిఘా
RR: చేవేళ్ల రోడ్డు ప్రమాదంతో రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఓవర్ లోడ్తో తిరుగుతున్న వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. రహదారులపై రవాణాశాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. రవాణా యాక్ట్కు విరుద్ధంగా నడుస్తున్న పలు వాహనాలు సీజ్ చేస్తున్నారు.