జిల్లాలో 5,27,680 కుటుంబాలకు కార్డులు పంపిణీ

CTR: రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నేటి నుంచి మొదలుకానుంది. చిత్తూరు జిల్లాలో 5,27,680 కుటుంబాలకు కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఈ నెల 30వ తేదీ నుంచి కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. లబ్ధిదారుని ఫొటో, ఏటీఎమ్ కార్డు సైజు, క్యూఆర్ కోడ్తో ఈ కార్డు ఉండనుంది.