పెద్దమ్మ తల్లి ఆలయంలో నేడు చండీహోమం: ఈవో
BDK: పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామంలో కొలువైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో నేడు చండీహోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రజిని కుమారి తెలిపారు. చండీ హోమంలో పాల్గొనే భక్తులకు అమ్మవారి ప్రసాదంతో పాటు శేష వస్త్రాలు అందించడం జరుగుతుందన్నారు. అలాగే భక్తులు రూ. 2516 చెల్లించి తమ గోత్రనామాలతో నమోదు చేసుకోవాలని సూచించారు.