మినీ మహానాడులో పలు తీర్మానాలను ప్రవేశపెట్టిన గొట్టిపాటి

మినీ మహానాడులో పలు తీర్మానాలను ప్రవేశపెట్టిన గొట్టిపాటి

ప్రకాశం: ఒంగోలులో శుక్రవారం నిర్వహించిన టీడీపీ మినీ మహానాడు కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ వేదికపై దర్శి మినీ మహానాడులో చేసిన తీర్మానాలను ఆమె ప్రవేశపెట్టారు. డ్రైవింగ్‌ స్కూల్‌, దొనకొండ పారిశ్రామిక కారిడార్‌, ఎన్టీఆర్‌కు భారతరత్న వంటి తీర్మానాలున్నట్లు ఆమె తెలిపారు.