'మహనీయుల జయంతి న్యాయబద్ధంగా జరగాలి'
WNP: మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు న్యాయబద్ధంగా జరగాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిని కోరారు. సోమవారం వనపర్తి 'ప్రజావాణి' కార్యక్రమంలో కమిటీ సభ్యులు కలెక్టర్కీ ఫిర్యాదు చేశారు. ఉత్సవాలు న్యాయబద్ధంగా అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించాలని కోరారు.