బీజేపీ నూతన అధ్యక్షుల నియామకం
KNR: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ హుజురాబాద్ రూరల్, జమ్మికుంట రూరల్ మండల శాఖలకు నూతన అధ్యక్షులను నియమించినట్టు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ప్రకటన విడుదల చేశారు. తిమ్మాపూర్ మండల అధ్యక్షులుగా చింతం శ్రీనివాస్, హుజురాబాద్ రూరల్ అధ్యక్షులుగా పారిపల్లి కొండల్ రెడ్డి, జమ్మికుంట రూరల్ అధ్యక్షులుగా దొంతన వేణి రమేష్లను నియమించారు.