'మన్నేరు పరిసర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
NLR: లింగసముద్రం మండలం రాళ్లపాడు ప్రాజెక్టులో భారీ వర్షాల కారణంగా పూర్తిస్థాయిలో నీరు చేరిన నేపథ్యంలో ప్రాజెక్టు గేట్లు తెరిచే అవకాశం ఉందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. మన్నేరు ప్రభావ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని, వాగులు, బ్రిడ్జిలు దాటరాదని అధికారులు హెచ్చరించారు.