యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలి: DCP
PDPL: యువత లక్ష్యాన్ని నిర్దేశించుకొని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని డీసీపీ బి.రామ్ రెడ్డి సూచించారు. పెద్దపల్లి పట్టణంలోని ఇండియన్ మిషన్ హైస్కూల్లో జరిగిన కెరీర్ గైడెన్స్, రోడ్డు భద్రత అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. తల్లిదండ్రులు హెల్మెట్ ధరించేలా చూడాలని కోరారు.