గత యుద్ధాల గురించి ప్రస్తావించలేదు: శశిథరూర్

2015లో తొలిసారి భారత సైన్యం పాక్లోకి చొచ్చుకుపోయిందని శశిథరూర్ చెప్పారని కాంగ్రెస్ నేత ఉదిత్రాజ్ విమర్శించారు. గత కాంగ్రెస్ హయాంలో ఏమీ జరగనట్లు చెబుతున్న థరూర్ను బీజేపీ సూపర్ అధికార ప్రతినిధిగా నియమించాలని ఉదిత్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై థరూర్ స్పందిస్తూ.. తాను ప్రస్తుతం జరిగిన ఉగ్రవాదుల గురించే మాట్లాడానని, గత యుద్ధాల గురించి ప్రస్తావించలేదన్నారు.