కాకినాడలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్
KKD: కాకినాడ కమిషనర్ ఎన్.వి.వి సత్య నారాయణ మంగళవారం కచేరిపేట, వేంకటేశ్వరనగర్, పాత బస్టాండ్ ప్రాంతాలలో పర్యటించారు. పారిశుద్ధ్యం పనులను తనిఖీ చేసిన ఆయన, కార్మికుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. శానిటేషన్ విషయంలో రాజీ పడవద్దని సిబ్బందిని ఆదేశించారు. స్థానికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.