పోలీస్ సేవల్లో పారదర్శకతే లక్ష్యం: ఎస్పీ
KMR: జిల్లా పోలీస్ స్టేషన్లలో పారదర్శక సేవలు అందించడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర స్పష్టం చేశారు. సెక్షన్ ఇంఛార్జ్ల శిక్షణలో ఆయన మాట్లాడుతూ.. బాధితులకు సకాలంలో న్యాయం అందాలని, ప్రజలతో మర్యాదగా మెలగాలని (సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్) సూచించారు. విధుల్లో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, సమయపాలన పాటించాలని ఆయన పోలీసు సిబ్బందిని ఆదేశించారు.