‘కాఫీ గింజలను జీసీసీ కొనుగోలు చేయాలి’
ASR: ఆదివాసీ రైతులు పండించిన కాఫీ గింజలను జీసీసీ కొనుగోలు చేయాలని గిరిజన సంఘం చింతపల్లి మండల కార్యదర్శి సాగిన చిరంజీవి డిమాండ్ చేశారు. సోమవారం యర్రబంద గ్రామంలో రైతులతో కలిసి గిరిజన సంఘం నాయకులు ఆందోళన చేశారు. జనవరి నెలాఖరు వరకు మాత్రమే జీసీసీ రైతుల నుంచి తక్కువ కాఫీ గింజలను కొనుగోలు చేసిందన్నారు. ఫిబ్రవరి నుంచి కాఫీ గింజల కొనుగోలును నిలిపివేసిందన్నారు.