చమురు ధరల్లో భారత్ పాత్రపై అమెరికా కీలక ప్రకటన
చమురు ధరల్లో భారత్ పాత్రపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ప్రపంచ చమురు ధరలను స్థిరంగా ఉంచడంలో భారత్ కీలకమని తెలిపింది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు కూడా ఇందులో భాగమేనని పేర్కొంది. ప్రపంచ మార్కెట్లో చమురు లభ్యత, ధరల స్థిరీకరణపై అమెరికా-భారత్ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని అమెరికా రాయబారి సెర్గియా గోర్ వెల్లడించారు.