మందకృష్ణపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

మందకృష్ణపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

కోనసీమ: భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగపై చర్యలు తీసుకోవాలని సఖినేటిపల్లి మండలం ఎస్సీ వెల్ఫేర్ సభ్యులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో ఎస్సై దుర్గా శ్రీనివాస్‌కు ఎస్సీ వెల్ఫేర్ అధ్యక్షుడు ప్రతాప్ పిర్యాదు చేశారు. మందకృష్ణపై వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు.