VIDEO: ఏబీఎన్ కథనాలపై మాజీ మంత్రి ఆందోళన
TPT: ఏబీఎన్లో వచ్చిన ఓ కథనంపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ మేరకు తిరుపతిలో వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిచ్చి కూతలు, రాతలు రాస్తే తగలబెట్టేస్తాం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను దహనం చేశారు. ఈ ఆందోళనలో వైసీపీ నేతలు పెద్దఎత్తున పాల్గొన్నారు.