పశువును అపహరించిన ఇద్దరు అరెస్ట్
MNCL: కోటపల్లి మండలం కొల్లూరు గ్రామానికి చెందిన కొట్టే మల్లయ్య వ్యక్తికి చెందిన ఎద్దును అపహరించిన వారిని గురువారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సాంకేతికతను ఉపయోగించి నిందితులు మంథనికి చెందిన సమ్మయ్య, రవిలను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. పశువులను దొంగిలించిన, అక్రమ రవాణా చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.