అభివృద్ధి పనుల కోసం ఎంపీకి వినతి
ATP: జిల్లా రైతుల సంక్షేమం కోసం పశువుల షెడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి ప్లాంట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి కోరారు. ఈ మేరకు పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. స్థానిక అవసరాలను గుర్తించి తగిన సహకారం అందించాలని ఆయనను కోరగా సానుకూలంగా స్పందించారు.