'పశువులకు టీకా వేయించండి'

'పశువులకు టీకా వేయించండి'

WNP: పశువులకు తప్పనిసరిగా గాలి కుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలని రాష్ట్ర మానిటరింగ్ అధికారిణి డాక్టర్ రజని అన్నారు. గురువారం గోపాలపేట మండలంలోని చాకలపల్లిలో పశువైద్య సిబ్బంది నిర్వహిస్తున్న టీకా కార్యక్రమాన్ని ఆమె తనిఖీ చేశారు. 140 పశువులకు టీకా వేశామని జిల్లా పశువైద్యాధికారి వెంకట్ రెడ్డి చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.