జాతీయ వేదికపై మెరవనున్న కమాన్‌పూర్ కానిస్టేబుల్

జాతీయ వేదికపై మెరవనున్న కమాన్‌పూర్ కానిస్టేబుల్

PDPL: కమాన్‌పూర్ పోలీస్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ మట్ట రమేష్ జాతీయ వేదికపై మెరవనున్నారు. డిసెంబర్ 19 నుంచి 23 వరకు చత్తీస్‌గఢ్ బిలాయిలో జరిగే 14వ ఆన్ఇండియా పోలీస్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ పోలీస్ జట్టుకు ఆయన ఎంపికయ్యారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ట్రయల్స్‌లో రమేష్ ప్రతిభ కనబర్చి అర్హత సాధించారు. ఈ విజయంపై సహచర సిబ్బంది, కుటుంబ సభ్యులు అభినందించారు.