మదురై కోర్టు సంచలన తీర్పు
పోలీస్ స్టేషన్లో తండ్రీకొడుకును చిత్రహింసలకు గురి చేసి వారి చావుకు కారణమైన కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో 9 మంది పోలీస్ ఆఫీసర్లను దోషులుగా తేల్చింది. కరోనా లాక్ డౌన్ వేళ షాపు మూసివేయలేదనే కారణంతో ఫోన్ షాప్ నడుపుకునే జయరాం, అతని కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే లాకప్లో చిత్రహింసలకు గురి చేయడంతో వారు చికిత్స పొందుతూ మృతి చెందారు.