5వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి
AP: నిన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 5వ తరగతి విద్యార్థిని మృతిపై బాలిక తల్లి అనుమానం వ్యక్తం చేస్తోంది. భాష్యం పాఠశాలలో చదువుతున్న బాలిక.. నిన్న ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయింది. అయితే ఇది ఆత్మహత్య కాదు.. ఎవరో చంపి ఉరేశారని బాలిక తల్లి ఆరోపిస్తోంది. సీసీ కెమెరాల ఆధారంగా దీనిపై విచారణ జరిపించాలని పోలీసులను కోరుతోంది.