హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

ATP: ఈనెల 30న సీఎం నారా చంద్రబాబు నాయుడు బొమ్మనహాళ్ మండలం నేమకల్లు పర్యటన నేపథ్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లపై అధికారులతో అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ సమీక్షించారు. హెలీప్యాడ్, సభా ప్రాంగణం, తదితర ప్రదేశాలలో భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. జిల్లా పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టామని ఎస్పీ పేర్కొన్నారు.