'మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి'
VZM: మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో గంట్యాడ హైస్కూల్ని మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ పాణి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గురువారం హెచ్ఎంతో సమావేశమయ్యారు. విద్యార్థులకు తాగునీరు, ఫర్నిచర్, విద్యుత్ సౌకర్యం వంటి ఏర్పాట్లు పూర్తిస్థాయిలో ఉండాలని, పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని సూచించారు.