జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ఘన నివాళులు
TPT: దేశ మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి వెడుకలు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి, ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.