పేకాట ఆడుతున్న ముగ్గురిపై కేసు నమోదు

VZM: బొండపల్లి పోలీసు స్టేషన్ పరిధి బొడసింగిపేట గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై యు. మహేష్ బుధవారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 10,200 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని చెప్పారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో సిబ్బంది పాల్గొన్నారు.