గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అరకు ఎంపీ నిధులు

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అరకు ఎంపీ నిధులు

NLR: కోవూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయించాలని అరకు ఎంపీ తనూజా రాణిని శనివారం వైసీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కోరారు. ఆమె సానుకూలంగా స్పందించి రూ. 10 లక్షల నిధులు కేటాయించారు. దీనిపై ప్రసన్న హర్షం వ్యక్తం చేశారు. కొడవలూరులో ఈ నిధులు ఖర్చు చేయనున్నారు.