చిరంజీవిని కలిసిన తిరుపతి ఎమ్మెల్యే

తిరుపతి: మెగాస్టార్ చిరంజీవితో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తన కుమారులు మధన్, జగన్లతో కలిసి భేటీ అయ్యారు. శ్రీవారి ప్రతిమతో పాటు తీర్థ ప్రసాదాలను చిరంజీవికి అందజేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కి చిరంజీవి మద్దతుగా నిలవడం పట్ల ఆరణి శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు.