వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు
KDP: సిద్ధవటం మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామికి శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూల అలంకరణ, త్రికాలారాధన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఇందులో భాగంగా స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలను స్వీకరించారు.