న్యాయ సేవాధికార ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
MBNR: మహబూబ్ నగర్ మండలం ధర్మాపూర్ గ్రామ పంచాయతీలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. అడ్వకేట్ రవీందర్ నాయక్ పాల్గొని బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, డ్రగ్స్, రోడ్డు భద్రత చట్టాలపై ప్రజలకు వివరించారు. అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం అందించేందుకు సంస్థ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు.