గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నిక
JN: తరిగొప్పుల మండల గౌడ సంఘం నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా బత్తిని సురేందర్, ప్రధాన కార్యదర్శిగా నాగపురి సతీష్, గౌరవ అధ్యక్షులుగా తాళ్లపల్లి పోశయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంఘం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తన్నారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.