అదనపు కట్నం కోసం వేధింపులు.. కేసు నమోదు

KRNL: బేతంచెర్ల మండలం గూటుపల్లెకు చెందిన నన్నూరు లత అనే మహిళను మద్దికేర మండలం పెరవల్లికి చెందిన భర్త శశి కుమార్, అత్త, మామ నాగయ్య, రత్నమ్మ దంపతులు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు భర్త, అత్తామామపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కేసి తిరుపాల్ గురువారం తెలిపారు.