సర్వదర్శనానికి 8 గంటల సమయం

సర్వదర్శనానికి 8 గంటల సమయం

TPT: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. ఈ మేరకు 14 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. కాగా, శుక్రవారం 72,067 మంది స్వామి వారిని దర్శించుకోగా 25,212 మంది తలనీలాలు సమర్పించారు. రూ.4.75 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.