వైసీపీ నేత మృతి
ASR: డుంబ్రిగూడ మండలం కితలంగి పంచాయతీ పాడి గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు వయబారికి రౌతు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య హుటాహుటిన గ్రామానికి చేరుకుని పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.