'పూర్తి సమాచారంతో హాజరు కావాలి'
ASR: ఈనెల 29వ తేదీన కొయ్యూరు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు సోమవారం తెలిపారు. ఎంపీపీ రమేశ్ అధ్యక్షతన స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి మండలంలోని ప్రజాప్రతినిధులు అందరూ హాజరు అవుతారని చెప్పారు. ఈమేరకు మండలంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పూర్తి సమాచారంతో సమావేశానికి తప్పకుండా హాజరు కావాలన్నారు.