'మెనూ ప్రకారం బాలికలకు ఆహారాన్ని అందించాలి'
BNR: ప్రభుత్వ మెనూ ప్రకారం బాలికలకు ఆహారాన్ని అందించాలని, పరిశుభ్రమైన త్రాగునీటిని అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కరరావు, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి మాధవి లత కోరారు. గురువారం భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెంలో ఉన్న ఎస్టీ ఇంటర్ డిగ్రీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించి వసతులలేమిని గుర్తించారు.