ఆదిలాబాద్లో నేటి పత్తి ధర వివరాలు..
ADB: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో సోమవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.8,110గా, ప్రైవేట్ పత్తి ధర రూ. 6,900గా నిర్ణయించారు. శుక్రవారం ధరతో పోలిస్తే సోమవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేటు రూ. 40 పెరిగినట్టు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు.