లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చాయి. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావెద్ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ ప్రారంభమైంది. ఇందుకోసం 10 గంటల సమయం కేటాయించారు. సభను నడిపేందుకు ప్రత్యేక సభాపతిని నియమించాలని విపక్షాలు కోరగా.. ప్రభుత్వం సీనియర్ ఎంపీ జగదాంబికా పాల్ను నియమించింది.