ఉల్లి రైతులకు మంత్రి టీజీ భరత్ భరోసా

KRNL: రైతులు నష్టపోకుండా క్వింటా ఉల్లిని రూ.1200లకు కొంటున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు మార్కెట్ యార్డ్ను సందర్శించి ఉల్లి రైతులతో మాట్లాడి భరోసా ఇచ్చారు. రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ముందుంటారన్నారు. జిల్లాలో ఉల్లి రైతుల సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి పరిష్కరించారన్నారు.