'గౌరవ వేతనాలు తక్షణమే విడుదల చేయాలి'

కృష్ణా: రాష్ట్రంలో ఇమామ్, మౌజ్జాన్లకు తక్షణమే పెండింగ్లో ఉన్న గౌరవ వేతనాలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు శనివారం డిమాండ్ చేశారు. వైసీపీ స్టేట్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాదర్ భాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ హఫీజ్ ఖాన్ పిలుపుమేరకు సెప్టెంబర్ 8 ఉదయం 10 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టరేట్ల వద్ద వినతిపత్రాలు సమర్పించాలని తెలిపారు.