సైబర్ నేరాలపై అవగాహన వాల్పోస్టర్ ఆవిష్కరణ
KMM: సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ప్రారంభమైన ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ పేరుతో నిర్వహిస్తున్న సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలపై రూపొందించిన అవగాహన పోస్టర్లను ఇవాళ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం అదనపు డీసీపీ, సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్, ఇన్స్పెక్టర్ కొండపర్తి నరేష్ పాల్గొన్నారు.