ఏ2 నిందితుడు లగచర్ల సురేష్ బైండోవర్
VKB: గత ఏడాది నవంబర్ 11న కలెక్టర్పై దాడి కేసులో ఏ2 నిందితుడు లగచర్ల సురేష్ను సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో దుద్యాల్ పోలీసులు బైండోవర్ చేశారు. గ్రామంలో గొడవలు జరిగే అవకాశం ఉన్నందున ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. అల్లర్లు సృష్టిస్తే రూ. లక్ష వరకు జరిమానాతో పాటు కఠిన చర్యలు ఉంటాయని తహశీల్దార్ కిషన్ హెచ్చరించారు.