వెలుగు మహిళా మార్ట్ పరిశీలించిన డీఆర్డీఏ పీడీ
గుమ్మలక్ష్మిపురం పెట్రోల్ బంక్ ఆవరణలో బుధవారం ప్రారంభించిన వెలుగు మహిళా మార్ట్ను డీఆర్డీఏ పీడీ ఏం.సుధారాణి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రికార్డులు పక్కగా నిర్వహించాలని, మార్ట్కు విస్తృత ప్రచారం చేపట్టాలని, మహిళా సంఘాలు సభ్యులు మార్ట్లో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసే విధంగా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.