ఆర్టీసీ బస్ ఢీకొని ఒక వ్యక్తి మృతి
E.G: గోకవరం మండలం కొత్తపల్లి ఆర్టీసీ బస్టాండ్లో శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడు గంగవరం మండలం జడేరు గ్రామానికి చెందిన షేక్ సాయి బాబాగా స్థానికులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే 108లో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా, అప్పటికే మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు.